టీఆర్ఎస్ ‌…‌ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారితే.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైంది

.. బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టిఆర్ఎస్ ‌తెలంగాణ ద్రోహుల పార్టీగా మారితే.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని బండి సంజయ్ పేర్కొన్నారు. స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని, బూర నర్సయ్య గౌడ నిజాయితీకి మారు పేరు అన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య లాంటి నేతలు కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ కు కేంద్రం ఇచ్చిన నిధులపై ఎన్నికల సమయంలోనే గ్రామగ్రామానికి వెళ్లి స్పష్టత ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కేసీఆర్ ఇవ్వటం‌ లేదని, ఫాంహౌజ్ నుండి కేసీఆర్ ను ఇందిరా పార్క్ కు తీసుకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. భారత రాష్ట్ర సమితి అధినేతనని చెప్పుకున్న కేసీఆర్ ను మునుగోడు ఎన్నికల్లో ఒక గ్రామానికే పరిమితం చేసిన ఘనత బీజేపీదేనని, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి ష్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.