కాంగ్రెస్, భాజపాల మాటలు నమ్మితే ఆగమవుతం

కాలే యాదయ్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/వికారాబాద్ ప్రతినిధి: నారాయణ పుర్ బంగారు మైసమ్మ దేవస్థానం లో ప్రత్యేక పూజలు చేసి నవాబ్ పేట్ మండలం మమ్ ధన్ పల్లి, కుమ్మరిగుడ, మూలమాడ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర లో బాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం లో పాల్గొన్న యాదన్నకు గ్రామస్తులు గడపగడపకు వీర తిలకం దీద్ది మంగళ హారతులతో,కోలాటలతో, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యాదన్న మాట్లాడుతూ ఆభివృద్ధి ముందుకు పోవాలంటే మళ్లీ నన్ను ఆశీర్వదించి గెలిపించండి జీవితాంతం మీ కోసం సేవకుడిలా పనిచేస్తా అనీన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బంగారు భవిష్యత్తుకు బాట, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. కాంగ్రెస్‌ అరాచక పాలనే తెలంగాణ వెనుకబాటు, కరువుకు కారణం ఆన్నారు మరోసారి వారికి అధికారం ఇస్తే పంటికి అంటకుండా రాష్ర్టాన్ని మింగేస్తారు.  కాంగ్రెస్‌ పిచ్చిప్రేలాపనలు, అవాకులు చెవాకుల వల్లే ప్రజల ముందుకు వచ్చిన. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగించాలంటే BRS నే గెలిపించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో అభిమానులు,కార్యకర్తలు, చేవెళ్ల ప్రజలు BRS పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.