రాష్ట్రంలో పాలన చూస్తుంటే.. రాజులు, చక్రవర్తుల పాలన గుర్తుకొస్తోంది

..టీడీపీ నేత వర్ల రామయ్య

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్ పాలనను జమీందారి పాలనతో పోల్చారు టీడీపీ నేత వర్ల రామయ్య. పరిస్థితుల బట్టి చూస్తే  వివేకా హత్యకేసు విచారణ జాప్యానికి జగనే కారణంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో పాలన చూస్తుంటే.. రాజులుచక్రవర్తుల పాలన గుర్తుకొస్తోంది. జమీందారీ పాలనా పోకడలు జగన్ పాలనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక వ్యవస్థ మరో వ్యవస్థపై దాడిచేయడంవ్యవస్థలు పోటీతత్వంతో వ్యవహరించడం బాధాకరం. పోలీస్ వర్సెస్  సీబీఐసీబీఐ వర్సెస్ పోలీస్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బాబాయ్‌ని చంపిన వారిని పట్టుకోలేని జగన్..అసమర్థపాలకుడు. వివేకా హత్యకేసు విచారణలో జాప్యానికి కారణం ముఖ్యమంత్రి కాదావిచారణలో అన్నీబయటకు తీస్తున్న సీబీఐని కార్నర్ చేసిఇబ్బందులకు గురిచేస్తారాఅప్రూవర్‌కి పూర్తిస్థాయి రక్షణ కల్పించికేసు విచారణ  త్వరగా పూర్తిచేసినిందితులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.