బిజెపి, టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే దేశాన్ని అమ్ముతారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం పోసిడబ్బులు పంచిమధ్యం మత్తులో ఉంచిమనం ఆలోచన చేయకుండ ప్రలోభాల్లో ముంచెత్తిమభ్య పెట్టి ఓట్లు వేయించుకొని టీఆర్ బిజెపి పార్టీలు మన ఊరునుమన నియోజకవర్గాన్నిరాష్ట్రాన్నిదేశాన్ని అమ్ముకుంటారని,  వారు చేస్తున్న ప్రలోభాల పట్ల మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిలేకుంటే భవిష్యత్తు అందకారంగా మారుతుందని” సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామాంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడులో ఓట్లను కొనుగోలు చేయడానికి బిజెపిటీఆర్ పార్టీలు పోటా పోటీగా డబ్బుల సంచులతో దిగాయన్నారు. దేశ ఆస్తులును ఇప్పటికే కార్పోరేట్ శక్తులైన అంబానిఆధానీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమ్ముతున్నదనిమునుగోడులో బిజెపిని గెలిపిస్తే వారికి దేశాన్ని అమ్మకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుందన్నారు.  అచ్చెదిన్ తీసుకువస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రోజు రోజుకు పెట్రోల్డిజిల్వంటగ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలుపెంచి సచ్చెదిన్ తీసుకొచ్చారనిమునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి వాత పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే పెరిగిన ధరలు తగ్గుతాయన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లుదలితులకు మూడు ఎకరాలు భూమిఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన టీఆర్ ఎస్  పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వాత పెట్టాలని కోరారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకుండ ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకిధరలు పెంచుతూ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్లకు దారదత్తం చేస్తున్న బిజెపికి ఈ ఉప ఎన్నికల్లో ఓట్లు వేస్తే వారు దేశాన్ని అమ్మేస్తారని వివరించారు. ఓటు వేసే ముందు పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచన చేయాలని సూచించారు. మనలని అభివృద్ది చేసింది ఎవరుఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చి ఉచిత వైద్యం అందించింది ఎవరుఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చి ఉచితంగా విద్య ఇచ్చింది ఎవరువలసలు నివారించడానికి గ్రామాల్లో ఉపాధి పనులు తెచ్చింది ఎవరునాగార్జున్  సాగర్ కట్టి సాగుత్రాగు నీరు ఇచ్చింది ఎవరుభవిష్యత్తులో మనలను అభివృద్ధి చేసేది ఎవరని” పది నిమిషాలు ఆలోచన చేస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు మీ కండ్ల ముందు కనిపిస్తాయన్నారు. కాంగ్రెస్ అభివృద్ధిప్రజ సంక్షేమం సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మనిషిగా చివరి శ్వాస వరకు పని చేసిన నిస్వార్ధనాయకుడు స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ ఆశయ సాధన కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన బిడ్డ మన మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర్ రావురాందాసునాయక్దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.