వైభవంగా అమ్మవారి నిమజ్జనం

తెలంగాణ జ్యోతి/నసురుల్లాబాద్: మండల కేంద్రంలో పాటు, వివిధ గ్రామాలలో ఘనంగా దసరా సంబరాలను పురస్కరించుకున్నారు, గత తొమ్మిది రోజులుగా అమ్మవారికి నవరాత్రుల్లో వివిధ రూపాలతో అలరించిన భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు, అనంతరం దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున దుర్గామాతను అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా యువ భారత్ దుర్గాభవాని,యువజన దుర్గ భవాని కమిటీ సభ్యులు , భక్తులు, స్వాములు, గ్రామ పెద్దలు, యువకులు, యువతులు, ఘనంగా నిర్వహించారు, డీజే ఆటపాటలతో, యువతీ, యువకుల నృత్యాలతో, చిన్నారుల కోలటాలతో, పోతురాజుల విన్యాసాలతో, గ్రామంలో దుర్గాదేవిని పలు వీధులగుండా డప్పుచప్పుళ్ళతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో నిర్వహించిన రథయాత్రలో మహిళల కోలాటాలు , ఆట పాటలు ఎంతగానో ఆకట్టుకుంది, దుర్గాదేవి శరన్న వారోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు గురువారం అమ్మవారిని మండల కేంద్రంలో ఊరేగింపు చేసి అనంతరం ఆ దుర్గా భవాని గంగమ్మ ఒడికి చేర్చారు.

Leave A Reply

Your email address will not be published.