మరికొద్ది సేపట్లో కవిత ఇంటికి సిబిఐ బృందం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: లిక్కర్ కేసులో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారుల బృందం మరికొద్ది సేపట్లో విచారించనుంది. గత రెండు మూడు రోజులపాటు తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉన్న కవిత పలు సలహాలు సూచనలు స్వీకరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు సంఘీభావంగా పలువురు ముఖ్య నాయకులు ఆమె నివాసం వద్దకు చేరుకోగా ఆమె నివాసానికి సమీపంలో సంఘీభావం తెలుపుతూ పలువురు నాయకులు ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేయించారు. నలుగురు సిబిఐ అధికారుల బృందం ఆమెను లిక్కర్ కేసులో విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కవిత ఇంటికి ఎవరు రాకుండా పోలీసులు కథదిట్టమైన ఏర్పాట్లు చేయగా వారి నివాసానికి కొద్ది దూరంలో తెరాస శ్రేణులు చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.