ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల  జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. గజ్వేల్‌, కామారెడ్డి  స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.

ఈసారి ఛాన్స్‌ దక్కని సిట్టింగులు వీరే 

తాటికొండ రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్‌,రేఖానాయక్‌ – ఖానాపూర్‌,చెన్నమనేని రమేష్‌ – వేములవాడ,గంప గోవర్ధన్‌ – కామారెడ్డి,రాథోడ్‌ బాపూరావ్‌ – బోథ్‌,ఉప్పల్‌ – భేతి సుభాష్‌రెడ్డి,వైర – రాములు నాయక్‌

Leave A Reply

Your email address will not be published.