తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసులు టెక్రియల్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలు చేస్తున్న క్రమంలో హర్యానా పాసింగ్ తో ఉన్న హెచ్ఆర్26ఏజీ5086 అనే నంబర్ గల కారును తనిఖీ చేస్తుండగా కారు డ్రైవర్ పారిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.