సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు

.. చంద్రబాబు యెద్దేవా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…‘‘తండ్రిని చంపిన కేసులో శిక్ష పడిన కొడుకు తండ్రి లేని బిడ్డని క్షమాభిక్ష పెట్టండని కోరాడట. జగన్ తీరు శిక్ష పడిన కొడుకులాగే ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లి లేదు.. చెల్లి లేదు.. బాబాయ్ లేడు.. బీజేపీ కూడా లేదంటూ ఏదేదో కామెంట్లు చేస్తున్నారన్నారు. ‘‘నేను ముసలివాడినా..? జగనుకు నాకున్న అనుభవమంత వయస్సు లేదు. సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు’’ అని యెద్దేవా చేశారు. 175 స్థానాలు గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పార్టీ నేతలకు అధినేత సూచించారు. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దన్నారు. పని చేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలని.. తాము ఆల్టరేట్నేటీవ్ చూస్తామని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు గట్టిగా మాట్లాటంలేదని అనుకోవద్దని.. పని చేయకుంటే గట్టిగానే యాక్షన్ తీసుకుంటానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.