రాష్ట్రంలోని అన్ని స్థానాల నుండి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ హాల్ లో జరిగినది. ఈ సందర్బంగా బిషప్ దాసన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ తో కలిసి మాట్లాడారు. కులమతాలతో సంబంధం లేకుండా అన్నీ వర్గాలకు ముఖ్యంగా యువత, మహిళల కు అధిక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో సభలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తామని వివరించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మాదక ద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. మాతృ ప్రేమతో పరిపాలన సాగించాలనే నినాదంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. రెండు రోజుల్లో పార్టీ తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ సీయెచ్ బాలకృష్ణ, పార్టీ నేతలు కొండల రావు ఉదయలక్ష్మి, మోహనగాంధీ, బాషా, జి.లతా,కే.వాణి,పుష్పాంజలి,దశరధం, వాసుదేవరావు, నవీన్ కుమార్,నవీనారాణి, శివకుమార్ యాదవ్,కే.శ్రీనివాస్, తదతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.