గవర్నర్ తమిళి సై ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్యులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి బృందం సభ్యులు గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ గారిని రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ రోజున రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి గత సంవత్సర కాలం హైదరాబాద్ కార్యక్రమాల రిపోర్ట్ ను అందించారు. వై ఆర్ సి విద్యార్ధులకు వారు అందించి న సేవలకు సర్టిఫికేట్ గవర్నర్ చేతుల మీదుగా పంపిణి చేశారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ద్వారా బాల పరమేశ్వరి మాధపాటి త్రినేత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ 50 మంది క్షయ వ్యాధి రోగుల ను దత్తత తీసుకోవడంతో గవర్నర్ ఆమెను ప్రశంసించారు.  హైదరాబాద్ జిల్లా శాఖా మొత్తం రెడ్ క్రాస్ కు ఆదర్శంగా నిలుస్తుందని భీమ్ రెడ్డి గారిని అభినందించారు. గవర్నర్ ను కలిసిన బృంద హైదరాబాద్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ విజయ కుమారి, యం సి సభ్యులు వినయ్ కిశోర్, రియాజుద్దీన్ మరియు ప్రవీణ్, గాయకుడు వెంకటేశ్వర్లు జ్యోతి, సోమశేఖర్ తదితరులు కలిశారు.

Leave A Reply

Your email address will not be published.