బడ్జెట్ చడదువుతూ పార్లమెంట్ లో సారీ చెప్పిన ఇందిరాగాంధీ.. ఎందుకో తెలుసా?

IndiraGandhi_1551644497497_1635708119712.jpg

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే 1970లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. మొరారాజీ దేశాయ్ ఆకస్మిక రాజీనామాతో, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వీకరించారు. ఫిబ్రవరి 28 న బడ్జెట్ సమర్పించడానికి వచ్చారు. ప్రజలు ఆమె మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూశారు. ఆమె ప్రసంగానికి లేచి నిలబడితే చప్పట్లు మారుమోగాయి. కానీ ఆమె నన్ను క్షమించండి అని చెప్పడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు.

ఇందిర చిరునవ్వుతో ‘సారీ, ఈసారి సిగరెట్ తాగేవారి జేబుల భారం పెంచబోతున్నాను’ అని పదే పదే చెప్పారు. విపక్షాలకు అప్పుడు విషయం అర్థమైంది. గాంధీ సిగరెట్లపై 3% పన్నును 22%కి పెంచారు. సిగరెట్లపై పన్ను ఏకంగా 633% పెరిగింది. ఈ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా అందరి ఇళ్ళల్లో మహిళలు హర్షాన్ని వ్యక్తం చేసినట్లు అప్పట్లో మీడియా రిపోర్ట్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.