అమానుషం.. ఐదేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై మట్టిలో పాతిపెట్టారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. రాబందుల్లా వారిపై ఎగబడుతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో తాజాగా అత్యంత హేయమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు దుర్మార్గులు ఐదేళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ చేశారు. ఆపై ఆ బాలిక చనిపోయిందని అనుకుని, బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బాధితురాలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఐదేళ్ల మైనర్ బాలిక ఇంటి ముందు ఆడుకుంటోంది. అప్పుడే రింకూ, లవ్‌కుశ్, అమ్రీష్ అనే ముగ్గురు యువకులు అక్కడికి వచ్చి.. మాయమాటలు చెప్పి అక్కడి నుంచి బాలికని ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక చనిపోయిందని భావించి.. మట్టిలో పాతిపెట్టి, ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు.. కూతురు కనిపించకుండా పోవడంతో, ఆమె ఆచూకీ కోసం తల్లి వెతకడం ప్రారంభించింది. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. తమ ఐదేళ్ల బాలిక కనిపించడం లేదని, ముగ్గురు అబ్బాయిలు ఆమెని ఎత్తుకెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.