నేషనల్ హైవే పనుల పరిశీలన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగుడా గ్రామంలో నేషనల్ హైవే పనులను మంగళవారం రాష్ట్ర స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షులు ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పనులను వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంకి మంత్రి మల్లారెడ్డి గారు నారపల్లి నుంచి ఏదులాబాదుకు రోడ్డు విస్తీర్ణ పనులకు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చి కేంద్రం ఇచ్చిన నిధులతో కేంద్రాన్ని విమర్శిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సహాయంతో గ్రామాలలో రోడ్లు వైకుంఠధామాలు డంపింగ్ యార్డ్స్ పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు రైతు వేదికలు రైతు కల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు ఉపాధి హామీ కూలీల ద్వారా పూర్తి సహకారం అందిస్తున్న కేంద్రాన్ని విమర్శిస్తూ సోయి తప్పి మాట్లాడుతున్నారని ఈ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ కార్యక్రమాన్నిగా మార్చి జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లన్న అంటూ నినాదిస్తూ ప్రజలు ఏమీ తెలియని అయోమయంలో ఉండిపోయారని త్వరలోనే అవినీతి అక్రమాలపై ప్రజలు మీకు మీ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజు వస్తుందని అన్నారు మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడితే ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలు మన జిల్లాకు హెచ్ఎండిఏ నిధులు రావాల్సినవి కానీ ఇప్పటివరకు తేకపోవడం మీ అసమర్ధతకు కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, బసవరాజ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.