12వ తేదీ నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కుద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్ టికెట్ల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా ఈ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ల‌తో విద్యార్థుల‌కు ప‌రీక్షా కేంద్రాల‌కు వ‌స్తేవారిని త‌ప్ప‌కుండా అనుమ‌తించాల‌ని బోర్డు అధికారులు చీఫ్ సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. హాల్ టికెట్ల‌పై ఆయా కాలేజీల ప్రిన్సిప‌ల్స్ సంత‌కాలు త‌ప్ప‌నిస‌రి కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఆయా కాలేజీల ప్రిన్సిప‌ల్స్ కూడా త‌మ లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థుల‌కు అంద‌జేయొచ్చు.

Leave A Reply

Your email address will not be published.