తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి 29 మధ్య ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ 20 రోజుల క్రితమే పూర్తయింది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది.