ఐఫా సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ చైర్మన్ డెకపాటి ఆడమ్ రాజ్ మరియు తెలంగాణ ఉపాధ్యక్షులు డాక్టర్ ఐజాక్ రాజ్ సెలబ్రేషన్కు కేంద్రమంత్రికిషన్ రెడ్డిని గురువారం ఢిల్లీలో కలిసి ఆహ్వానించారు. గత 30 సంవత్సరాలుగా సంస్థ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సహాయ సహకారాలు అందించిన కిషన్ రెడ్డి కి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇండియా ఇజ్రాయిల్ మైత్రి సంబంధానికి సహకరించాలని కోరారు