దేవాదాయశాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనం అవసరమా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వరూపానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయశాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనం అవసరమా? అని స్వరూపానంద ప్రశ్నించారు. 17 ఏళ్లుగా పదోన్నతి రాకపోవడం దేవాలయ ఉద్యోగుల దౌర్భాగ్యమన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులను ఆలయాలకు ఈవోలుగా వేయడమేంటి? అని ప్రశ్నించారు. దేవాలయ ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలన్నారు.