‘శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..?

- జగ్గారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలన్నారు. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కష్టాలు, బాధలు, అవమానాలు చూసి అంబేద్కర్ చదువుకున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని జగ్గారెడ్డి సూచించారు. అంటరానితనమని నిర్ములించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు.అరుంధతి ఎస్సీ సామాజికవర్గమేనని.. రెడ్డి, బ్రాహ్మణుడు ఎవరైనా అరుంధతి నక్షత్రం చూడాల్సిందేనన్నారు. కులాల మధ్య, మతాల మధ్య పంచాయితీ ఇప్పుడు కలియుగం వచ్చాక మొదలైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హనుమంతుడుకి ఉన్న బలం గురించి చెప్పింది జాంబవంతుడేనని.. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గమేనన్నారు. అలాంటి జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ‘శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..? ఎప్పుడైనా వారు కొట్టుకున్నారా.. మీరు చూశారా..?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.