బాధ్యతల్లో ఉన్న వాళ్లు అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  గవర్నర్‌ తమిళిసై పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘బాధ్యతల్లో ఉన్న వాళ్లు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు.. కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కనపడకపోతే ఏం చేసేది లేదు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదు.’’ అని గుత్తా హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.