తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఫామ్హౌస్ నిందితుడు సింహయాజీ తో సంబంధాలపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. 6 నెలల క్రితం సింహయాజీని కలిసింది వాస్తవమే అని కోదండరామ్ అన్నారు. ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని కోదండరామ్ స్పష్టం చేశారు. తిరుపతి నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని, సింహయాజీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్న విషయం అప్పట్లో తెలియదని కోదండరాం చెప్పారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కోదండరామ్ పేర్కొన్నారు.