గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క టి.ఎస్.ఐ.ఆర్.డి. రాజేంద్రనగర్ లో సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై శాఖ యొక్క పని తీరును సమీక్షించారు. ఈ సమావేశమునకు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, తో పాటు ఆ శాఖ స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, , ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావ్, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి పాల్గొని ఆయా విభాగాల వారీగా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, PMKSY వాటర్ షెడ్స్, రూర్బన్ మిషన్, స్వచ్చ భారత్ మిషన్, ఈ.జి.ఎమ్.ఎమ్ (EGMM), 15వ ఆర్ధిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ, పౌరులకు గ్రామములోనే వివిధ రకాల సేవలను ఈ-పంచాయతీ ద్వారా అందించడం, గ్రామపంచాయతీ అభివృద్ది కొరకు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమల గురించి, సెర్ప్ మహిళా సంఘాలు, సెర్ప్ బ్యాంక్ లింకేజ్, వికలాంగుల సదరం సర్టిఫికేట్ జారీ, అన్ని రకాల పెన్షన్ లు, మహిళా రైతు ఉత్పత్తి దారుల (FPO) ల సంఘాల కార్యక్రమాలు, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల పారదర్శకమైన పద్దతిలో ఋణాల మంజూరీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో చేపట్టే వివిధ రకాల రోడ్లు వేయు కార్యక్రమాల గురించి వివరంగా తెలీసుకున్నారు.ఆదేవిధముగా, ఈ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడే కార్యక్రమాలని, ఈ కార్యక్రమాలు సమర్ధవంతముగా ప్రజలందరికిచేరువయ్యేలాగా నిర్వహించడానికి అధికారుల అనుభవాన్ని ఉపయోగించి, అధికారులందరు బాగా కష్టపడి పనిచేయాలని, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి. దనసరి అనసూయ సీతక్క గారు తెలిపారుమరియు అధికారుల పనితీరును ప్రశంసించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.