ఏపీలో సమ్మె సైరెన్ మోగించిన  విద్యుత్ ఉద్యోగులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరెన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సిబ్బంది మొత్తం సమ్మెలోకి దిగనున్నారు. మంగళవారం ఉద్యోగులంతా వర్క్ టూ రూల్‌లో ఉన్నారు. బుధవారం పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే రేపు సాయంత్రంలోపు మొబైల్ సిమ్‌లు ఇచ్చేయాలని ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్‌లు మినహా మిగతా వాటికి హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణపై యాజమాన్యం, ఉద్యోగులు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగేందుకు రెడీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.