బూడిద దోపిడీదారుడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది

     రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎం ఎస్ రాజ్ ఠాకూర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడని రామగుండం నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ  భూదందా బూడిద దందా ఇసుక దందాలు చేస్తూ ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన స్థానిక శాసన సభ్యుడికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు . మంగళవారం గోదావరిఖని6వ డివిజన్ సప్తగిరి కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్ రామదేవి తమ అనుచరులు  1000 మందితో  రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ… రామగుండం ప్రాంతన్ని అభివృద్ది చేయాల్సిన శాసన సభ్యుడు ఇసుక దోపిడి, బూడిద దోపిడి చేస్తూ, ఉద్యోగాలు అమ్ముకున్నరాని, స్థానిక శాసన సభ్యుడికి ఓట్ల ద్వారా బుద్ది చెప్పే సమయం వచ్చిందాని అన్నారు.. బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫిజ్ రియంబర్స్ మెంట్ తో విద్యను అందించామని, ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించామని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదలను ఆదుకున్నామని అన్నారు.25 సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తున్న నాకు చేతి గుర్తుకు ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, పేద ప్రజలకు న్యాయం జరుగలని కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.20రోజులు ఓపికగా ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రతి పేద ప్రజలకు న్యాయం చేస్తా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నారు.అంతకు ముందుగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.