నగరంలోని జీడిమెట్లలో దారుణం..పెనం లోంచి పొయ్యీలోకి  

  ఇతురుల సాయం తీసుకోవడమే ఆమె పాలిట శాపం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్; పిల్లలకు మంచి బుద్దు చెప్పాల్సిన తండ్రే చెడుమార్గంలోకి వెళ్లాడు. కామాంధుల నుంచి కాపాడాల్సిన తండ్రి.. కన్న కూతురిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. విషయం తెలిసి అక్కున చేర్చుకోవాల్సి తల్లి.. పట్టించుకోకపోవడంతో ఆ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తల్లి తన మాటలు వినిపించుకోలేదని.. ఇతురుల సాయం తీసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది.ఇంతకీ ఏం జరిగిందంటే… నగరంలోని జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి యువతిపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి అత్యాచారం చేస్తున్నారని తల్లికి చెప్పినప్పటికీ కూతురి మాటలని ఆ తల్లి పెడచెవిన పెట్టింది. దీంతో తల్లి పట్టించుకోకపోవడంతో ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడితో స్నేహం ఏర్పడటంతో తన గోడును సదరు వ్యక్తికి చెప్పింది. అయితే ఆ యువకుడు.. యువతికి సాయం చేయపోగా.. తాను న్యాయం చేయిస్తానని చెప్పి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. యువకుడి బాధ భరించలేక యువతి మరొకరిని ఆశ్రయించింది. చివరకు అతడు కూడా సికింద్రాబాద్‌లోని రూముకి తీసుకువెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజులు గదిలో ఉంచి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. చివరకు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.