తల్లి,చెల్లెలు షర్మిలను కలవకూడదనే షెడ్యూల్ను మార్చుకున్న జగన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈ నెల 8 వతేది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల, భార్య విజయమ్మ 7వ తేదీ రాత్రికి ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారని కడపలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అయినా.. వర్ధంతి అయినా కూడా జగన్ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కనబెట్టేసి ఉదయాన్నే వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాంటిది ఆయన ఎన్నడు లేని విధంగా తన షెడ్యూల్ను 8 తేది సాయంత్రానికి మార్చుకున్నారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలను కలవకూడదనే జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారని జనం చర్చించుకుంటున్నారు. దీంతో ఈ విషయం కడపలో హాట్ టాపిక్గా మారింది.గత ఏడాది వర్ధంతి కార్యక్రమానికి షర్మిల హాజరవగా.. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ కావడంతో రాత్రికి రాత్రే ఆమె హైదరాబాద్కు వెళ్లిపోయారు. ప్రతిసారి 8 తేది ఉదయం 8 గంటలకు జగన్ రెడ్డి వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించే వారు. మొదటి సారిగా 8 తేది సాయం త్రానికి షెడ్యూల్ను మార్చుకుని హాట్ టాపిక్గా మారారు.