తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. గ్రీన్ టాక్స్ పేరుతో జగన్ సర్కారు దోపిడీని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లారీ డ్రైవర్ వివరించారు. తమిళనాడులో రూ. 200, తెలంగాణలో రూ. 500, ఏపీలో రూ. 6660 గ్రీన్ టాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారంటూ లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాక బహిరంగ సభలో గ్రీన్ టాక్స్ బాదుడుపై మాట్లాడతానని పవన్ భరోసా ఇచ్చారు. సుజాతనగర్ వెళ్లి వస్తుండగా మధ్యలో కారు ఆపి పవన్ మాట్లాడారు.కాగా.. కోట్లు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీబీసీఎన్సీ భూములను పరిశీలించారు. సీబీసీఎన్సీ భూముల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. క్రిస్టియన్ ట్రస్ట్కు చెందిన ఈ వివాదాస్పద భూములను, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వానికి చె౦దాల్సిన భూములను ఎంపీ అధికార బలంతో చేజిక్కించుకొని నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక కోట్ల రూపాయలు చేతులు మారాయి అరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ భూములను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.