వైద్య రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారు

- శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైద్య రంగాన్ని జగన్ భ్రష్టుపట్టించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాడు – నేడు కింద వైద్య రంగాన్ని ఉద్ధరించినట్టు జగన్ బడాయి కబుర్లు చెబుతున్నారని మండిపడుతున్నారు. మౌలిక సదుపాయాలు లేక నరకకూపాలుగా ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలకే పరిమితమైన వైద్య రంగంలో విప్లవం రావాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూదీ, సిరంజీ, జ్వరం బిళ్లలు కరువయ్యాయని అన్నారు. డాక్టర్లు, సిబ్బంది కొరతతో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం టీడీపీ అమలు చేసిన 33 పథకాలకు జగన్ మంగళం పాడారని విమర్శించారు. బిల్లులు పెండింగ్‌తో ఆరోగ్యశ్రీ కింద పేదలకు నెట్ వర్క్ ఆస్పత్రులు వైద్యాన్ని నిరాకరిస్తున్నారని, బిల్లులు పెండింగ్‌తో ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం నిరాకరిస్తున్న నెట్ వర్క్ ఆస్పత్రులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.