తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.”అన్నం తినే వ్యక్తి జగన్కు ఓటేయడు. సొంత బాబాయిని చంపిన వ్యక్తి జగన్. అలాంటి జగనుకు ఎవ్వరూ ఓటేటరు. జగనుకు పులివెందుల్లో ఓటమి ఖాయం. నాలుగేళ్ల నరకాన్ని అనుభవిస్తున్నాం. అమ్మఒడి బూటకం. పేదలపై రూ. 51 వేల కోట్ల మేర విద్యుత్ భారం వేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. టమాట రూ. 200కు చేరింది. నిత్యావసర ధరలు పెరిగాయి. టీడీపీ హయాంలో ధరలు పెరిగితే నియంత్రించాం. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను కంట్రోల్ చేశాను. చెత్తపై పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగనే.” అని చంద్రబాబు విమర్శించారు.”ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు బకాసురుడు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడు. మట్కా నిర్వహణ.. గుట్కాల అమ్మకం.. తోపుడు బళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే రాచమల్లుకు అలవాటు. ఒకప్పుడు మామూలు కౌన్సిలర్గా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడు.” అని చంద్రబాబు ఆరోపించారు.”ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు ఇస్తాం. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. ముగ్గురు పిల్లలుంటే రూ. 45 వేలు.. నలుగురు పిల్లలుంటే రూ. 60 వేలు ఇస్తాం. ఫిష్ మార్కెట్ పెట్టి ఉద్యోగాలు తెచ్చాననే సీఎం జగనే. ఈ ప్రభుత్వంలో జాబ్ గ్యారెంటీ లేదు. మేం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. పరిశ్రమలు.. పెట్టుబడులు తెస్తాం. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం.. మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. బీసీల కోసం రక్షణ చట్టం తెస్తాం. పేదలను ధనికులను చేసేలా పూర్ టు రిచ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తాం.” అని చంద్రబాబు అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.