తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దోచుకోవడం, దాచుకోవడమే జగన్ రెడ్డి పని అని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. జిల్లాలోని కొల్లిపర మండలం బొమ్మువానిపాలెంలో ఇసుక రీచ్లను జనసేన నేతలు సందర్శించారు. జేపీ కంపెనీ చేసే ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యవరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరిగే రోడ్లు వేయడం లేదని… ఇసుక రవాణా కోసం మాత్రం నదిగర్భంలో రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. అడ్డగోలు తవ్వకాలతో చుట్టుపక్కల పంటలు కూడా నాశనం అవుతున్నాయన్నారు. తక్షణమే అక్రమ రవాణా ఆపకపోతే జనసేన రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుందని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.