ముద్దులు పెట్టి తల నిమిరిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విశాఖలో మత్స్యకారులు, మత్స్యకారుల సంఘ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం తిక్కవారిపాలెం.. ఎంపీటీసీ, వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… అన్ని వర్గాలను దెబ్బతీసిన వ్యక్తి సైకో ముఖ్యమంత్రి అని అన్నారు. సముద్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారులకు డెత్ సర్టిఫికెట్, సకాలంలో అందిస్తామని తెలిపారు. మత్స్యకారుడిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు రూ.10,000 తప్ప ఏదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ముద్దులు పెట్టి తల నిమిరిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, కళా వెంకట్రావు, గంట శ్రీనివాసరావు, వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారుLo

Leave A Reply

Your email address will not be published.