ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మళ్లీ జగనే సీఎం.. సంబరాలకి సిద్ధం అవ్వండి అంటూ YSRCP ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణం చేయనున్నట్లు ‘YSRCP’ వాళ్ళు ట్వీట్ చేసారు . విశాఖలో జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేసారు . ఆ రోజు నుంచి సంబరాలకి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇక అటు ఇవాళ సీఎం జగన్‌ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్‌ లో సీఎం జగన్‌ కి గ్రాండ్‌ గా వెలకమ్‌ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్‌ నుంచి దిగుతూ సీఎం జగన్‌ కనిపించారు. పింక్‌ కలర్‌ షటర్‌ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్‌ మోహన్ రెడ్డి .

Leave A Reply

Your email address will not be published.