20వ తేదీన సికింద్రాబాద్‌లో జగ‌న్నాథ ర‌థ‌యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్‌లో జగ‌న్నాథ ర‌థ‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రీ జ‌గ‌న్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్ర‌స్ట్ ప్ర‌క‌టించింది. జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఊరేగించ‌నున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ జ‌న‌ర‌ల్ బ‌జార్‌లోని జ‌గన్నాథ ఆల‌యంలో 130 ఏండ్ల నుంచి ఈ ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు.20వ తేదీన ఉద‌యం 6:15 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. సాయంత్రం 4 గంట‌ల‌కు జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ప్రారంభం అవుతుంద‌న్నారు. జ‌న‌ర‌ల్ బ‌జార్ నుంచి ఎంజీ రోడ్డు మీదుగా, రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. రాత్రి 10:30 గంట‌ల‌కు ఈ ర‌థ‌యాత్ర రాణిగంజ్ చేరుకుంటుంది. తిరిగి ఉద‌యం 4 గంట‌ల‌కు జ‌గన్నాథ ఆల‌యానికి ర‌థ‌యాత్ర చేరుకుంటుంది. ర‌థ‌యాత్ర నేప‌థ్యంలో భ‌క్తులు ఉద‌య‌మే స్వామి వారిని ద‌ర్శించుకోవాల‌ని ఆల‌య నిర్వాహ‌కులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.