ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పతనం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్‌ పతనం.. చంద్రబాబు అరెస్టుతో అంతమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని వ్యాఖ్యానించారు. విజయవాడలో టీడీపీ నేత నాగుల్‌ మీరాతో కలిసి బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. 2023 జగన్‌ విధ్వంసనామ సంవత్సరంగా ముగిసిందని ఎద్దేవా చేశారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని చెప్పారు.బీసీలకు జగన్‌ ఒక టికెట్‌ ఇస్తే.. చంద్రబాబు నాలుగు సీట్లు ఇస్తారని అన్నారు. టీడీపీ అంటే బీసీ బ్రాండ్ అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.