కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసుల దాడిని ఖండించిన జగ్గారెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీస్ లు చేసిన దాడిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకి సంబంధించి తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతునందుకు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభత్వం కొందరు పోలీస్ అధికారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనుబంధం కార్యాలయం పై రాత్రి తనిఖీలా పేరు మీద దాడి చేసి అక్కడున్న స్టాఫ్ ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడారు.  పోలీస్ సెక్షన్ లను అడ్డంపెట్టుకొని అక్కడున్న కంప్యూటర్స్, లాప్ టాప్ సీజ్ చేసి,కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కి తాళం వేయడాని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉందికదా అని ఇష్టనుసారంగా కొందరు పోలీస్ అధికారులతో చట్టం లో ఉన్న సెక్షన్ లను అడ్డం పెట్టుకొని తెలంగాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యని భయబ్రాంతులకు గురి చేస్తుంది. రాష్ట్రంలో లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిన, ప్రజాస్వామ్య గొంతు ని నొక్కే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ లో లేని సంప్రదాయని టీఆర్ఎస్ పార్టీ తీసుకొని రావడం ఇది టీఆర్ఎస్ పార్టీ కి యేనటికైనా ప్రమాదమేనని గుర్తించుకోవాలని సూచించారు. తాను పాలు పోసి పెంచిన పాము తాననే కాటేస్తుందనే విషయం తెలియదా..?

అధికారము పూర్తిగా ఎప్పటికి టీఆర్ఎస్ దే అని ఉహించుకువడం కూడా మీ మూర్ఖత్వమే అన్నారు. మీరు అధికారం కకోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే ఆ రోజు మీరు ఏ మొఖం పెట్టుకొని మాట్లాడగలుగుతారు అధికారం లో ఎవరు ఉంటే పోలీస్ వారి మాట వినాల్సిందే అది చట్టం. రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టం మా మాట విని మేము చెప్పిన్నట్లు చేస్తే మీ పరిస్థితి ఏంటి  ప్రశ్నించారు. ప్రజాస్వామ్యని ఖుని చేసే కొత్త కొత్త ప్రయత్నలను తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షలను అనగాదొక్కడానికి కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్ కి అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలు పరిష్కరించామని. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ నాయకత్వని అనగాదొక్కమని కాదు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఆఫీస్ పై దాడిని ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పోలీస్ అధికారుల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ దీని మేము తీవ్రంగా పరిగనిస్తూ ఒక కార్యాచరణ తో పాటు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభత్వానికి వ్యతిరేకంగా, కొందరు పోలీస్ అధికారుల తిరుకి నీరసనగ ఉద్యమం చేయడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతి లో ఉద్యమలు, న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొంతమంది పోలీస్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.