బాన్సువాడ మున్సిపల్ కమిషనర్గా జీవన్?
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నూతనంగా ఏర్పడిన బాన్సువాడ మున్సిపాలిటీకి గతంలో సూపరిండెంట్ హోదాలో ఉన్న కళ్యాణం రమేష్కుమార్ ఇంచార్జీ కమిషనర్గా విధులు నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బదిలీపై వెళ్ళారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన షేక్ సలీంను ఉన్నతాధికారులు బాన్సువాడ బల్దియా కమిషనర్గా నియమించారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో షేక్ సలీం చేసిన అవినీతి అక్రమాలకు ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఆయనపై సస్పెన్షన్ వేటు విదించారు. ఇదిలా ఉండగా ప్రస్థుతం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్గా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వహించడంతో పాటు ఎల్లారెడ్డి ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన జీవన్ను కమిషనర్గా ఎంపిక చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గతంలో పనిచేసిన బాన్సువాడ మండలంల నాగారం గ్రామానికి చెందిన కళ్యాణం రమేష్కుమార్కు సైతం ఇక్కడ నియమించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. కాగా బుడ్మి గ్రామానికి చెందిన జీవన్కుమార్ తన సన్నిహితులకు కాంగ్రెస్ నేపథ్యం ఉండడంతో బాన్సువాడ బల్దియా కమిషనర్గా జీవన్ నియామకం పక్కా అని తెలుస్తుంది.