టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. నారాయణ్ పేట్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, దోరేపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీఆరెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.