జుక్కల్ ఎమ్మెల్యేకు రాజీనామా సెగ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో వచ్చే పథకాలు, ఫండ్స్ తో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కు రాజీ నామా సెగ తాగింది. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలోని మాక్లూర్ గ్రామానికి చెందిన యువకుడు, జుక్కల్ మండలంలోని విట్టల్ వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎమ్మెల్యే షిండే తో ఫోన్ లో సంభాషిస్తూ రాజీనామా చేయాలని కోరారు. రాజీనామా చేయడంతో వచ్చే ఉప ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నాడు. రాజీనామా తర్వాత తాము భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు పేర్కొన్నారు. ఈ విషయం జుక్కల్ ప్రజలలో చర్చ అంశం అయింది.

Leave A Reply

Your email address will not be published.