ఏపీ దొంగ ఓట్లపై విచారణ నుంచి తప్పుకున్నజస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో  మంగళవారం విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.