తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడే కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సైతం వార్ వన్ సైడ్ అయింది. మునుగోడులో గెలిచేది నేనే తగ్గేదే లే అంటూ సినిమా డైలాగులు పేలుస్తున్నారు. 60 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కేవలం 6 నెలల్లో చేసి చూపిస్తా.. మునుగోడులో ఒక్కో మండలానికి ఒక్కో కాలేజీ, ఉచిత ఆస్పత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇస్తానంటు ప్రచారం చేస్తున్నారు.