అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయిన  కడియం -తాటికొండ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఎవరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకున్నా ఇబ్బందే. ఇద్దరికీ ఒకే పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు. మొత్తమ్మీద స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు అధిష్టానానికి పరీక్షగా మారాయి. తనపై రాజయ్య చేసిన సంచలన ఆరోపణలను పార్టీ దృష్టికి తీసుకెళ్లేందుకు కడియం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసేందుకు కడియం శ్రీహరి వెళ్లారు. అధిష్టానం పెద్దల సూచనల తర్వాతే కడియం స్పందించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇద్దరు నేతలూ సిద్ధమవుతున్నారు. అధిష్టానం చూపు ఎవరివైపు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దమ్ముంటే కడియం శ్రీహరి తనతో చర్చకు రావాలని రాజయ్య సవాల్ విసురుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.