అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

- తలసాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి కైకాల మృతదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కైకాల అంత్యక్రియలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.మూడు తరాల పాటు సుమారు 777 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు అని, ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బాగా ఇష్టపడే వ్యక్తి సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్,అక్కినేని, కృష్ణంరాజు, కృష్ణ ఏ సినిమా లో నటించిన ఆ సినిమాల్లో కైకాల ఉండేవారని గుర్తు చేశారు.ఇటీవల కాలంలో సినీ నటుల మరణం తెలుగు ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు తీవ్ర దుఖానికి గురి చేస్తుందని పేర్కొన్నారు. అంత్యక్రియల కు హాజరయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.