కళాతపస్వీ విశ్వనాథ్,భార్య జయలక్ష్మి కన్నుమూత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దివంగత కళాతపస్వీ కె.విశ్వనాథ్,భార్య జయలక్ష్మి (88)కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ నిద్రలోనే కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల రెండో తేదిన కళాతపస్వీ కె.విశ్వనాథ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే! అప్పటికే జయలక్ష్మి మంచానికే పరిమితమై ఉన్నారు. కె.విశ్వనాథ్- జయలక్ష్మి దంపతులు పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తదుపరి అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది.