కంటివెలుగు కార్యక్రమం వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరం

- ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరమని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. బి ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. కంటివెలుగు కార్యక్రమం వల్ల పేదలకు ఎంతో ఉపయోగకరం.

మొదటివిడత కంటివెలుగు కార్యక్రమం వల్ల 1కోటి 54లక్షలకుపైగా టెస్టులు నిర్వహించారు. రెండోదఫా కంటివెలుగు కోసం కేసీఆర్ 2వందల కోట్లు కేటాయింపు చేసినందుకు ధన్యవాదాలు. 55లక్షల మందికి కంటివెలుగు ప్రోగ్రాం ద్వారా ఇచ్చేనెదుకు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని పేదలు ఉపయోగించుకోవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే బిఅరెస్ అధికారంలోకి రావాలి దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ అందాలి.. అది నెరవేరలంటే బిఅరెస్ కావాలి. ప్రజలకు సేవచేసే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంటే కంటివేలుగును అభినందించాలి. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు అక్కెరవచ్చే మాటలు మాట్లాడలేదు అని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వకుండా వంకర కూతలు కుస్తారు.

ఢిల్లీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఒక్కనాడు మాట్లాడలేదు. కేంద్రబిజెపి తెలంగాణ అభివృద్ధి కాళ్ళల్ల కట్టెపెట్టినట్లు చేస్తున్నారు. దేశంలో దిక్కు దివాణలేని పార్టీ కాంగ్రెస్… గ్రామాలను పట్టించుకోని పార్టీ కాంగ్రెస్. పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల పై మాట్లాడిన ఏకైక పార్టీ బిఅరెస్. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను దొంగ అనడం విడ్డురంగా ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ కంటివెలుగు మంచి కార్యక్రమం. బిఅరెస్ లో జాయిన్ అవ్వడానికి ఇతర రాష్ట్రాల నాయకులు సిద్ధంగా ఉన్నారు. దేశంలో ప్రజా పాలన కావాలంటే బిఅరెస్ అధికారంలోకి రావాలి.

Leave A Reply

Your email address will not be published.