భాజపా సమర్థక మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కపిల్ కుమార్ గుప్తా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కీ మద్దతుగా ఉత్తరప్రదేశ్లో జాతీయస్థాయిలో స్థాపించబడిన బాజాప సమర్థక మంచ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా సంఘ సేవకుడు వ్యాపారవేత్త కపిల్ కుమార్ గుప్తా నియమితులయ్యారు ఈ మేరకు సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపక్ శర్మ ఉత్తర్వులు పంపించారు ఈ సందర్భంగా కపిల్ కుమార్ గుప్తా గారు మాట్లాడుతూ మోడీ పాలనకు ఆకర్షితునై ఈ మంచులో చేరినట్టుగా తెలుపుతూ తనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి జిల్లా కమిటీలను వేసి మోడీ ప్రభుత్వం యొక్క పథకాలను పేద ప్రజలకు అందే విధంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలు సుఖసంతోషాలుగా ఉండడానికి కృషి చేస్తామని తెలిపారు ముఖ్యంగా మహిళలకు యువతకు మోడీ గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వాటిని సద్వినియోగపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో భాజపా సమర్థకు మంచు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేల్పూర్ శ్రీనివాసు సంఘ సేవకురాలు విజయ దేవి మాతృదేవోభవ సత్సంగ్ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ ఆఫీస్ ఇన్చార్జ్ కొండలరావు సంస్థ తెలంగాణ కోఆర్డినేటర్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కపిల్ కుమార్ గుప్తా గారిని హైదరాబాదులోని మూసాపేట్లో వారి సగృహంలో ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.