విజయసాయి రెడ్డిని కలిసిన  కర్రి వేణుమాధవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వి విజయసాయి రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిసారు. జులై 16వ తారీఖున విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే విశాఖ బీసీ గర్జన హాజరుకావలసింది ఆహ్వానించినట్టు తెలిపారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు ఉత్తరాంధ్ర వైయస్ఆర్సీపీ ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 సంవత్సరాల ఉద్యమ నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ గారికి స్వర్ణ కంకణ ధారణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా కర్రి వేణుమాధవ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.