శ్రీవారి ఆలయంలో కార్తీక పూజలు

.. దర్శించుకున్న సభాపతి పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: మండల పరిధిలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం కార్తీక మాసంను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు  ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు కార్తీకమాసం ఏర్పాట్లు పర్యవేక్షించారు. శనివారం సందర్భంగా రైతునగర్ వాస్తవ్యులైన సిహెచ్ పూర్ణయ్య-రమాదేవి,  ముల్లంగి శ్రీనివాస్-రాజకుమారి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు వరకు  భక్తుల సౌకర్యార్థం బొమ్మందేవ్ పల్లి ఎక్స్ రోడ్డు నుండి ఆలయానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని సభాపతి తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.