రాజరాజేశ్వరున్ని సైతం కేసీఆర్ మోసం చేశాడు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు.ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలి. కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.