నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట

.. వై ఎస్ షర్మిల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అన్నివర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వైఎస్సార్టీపీ షర్మిల విమర్శలు గుప్పించారు. మంగళవారం లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ… నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడంలో కేసీఆర్ దిట్ట అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తేనే ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్ బయటకొస్తారన్నారు. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులను కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపంలో కేసీఆర్ తినేశారని ఆరోపించారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా సాగుతోందన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్‌కు అమ్ముడుపోయాయంటూ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.