తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నాగోల్, ఎల్బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్లో కలిపే ప్రయత్నం చేస్తాం. రేపే చేస్తామని చేయలేదని అంటారు. అందుకే ముందుగానే చెబుతున్నా. నాకు తెలుసుకు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే.. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం. ఆ దిశగా ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తాం. టిమ్స్ ఆసుపత్రి గడ్డి అన్నారంలో రాబోతుంది’ అన్నారు.